త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే

Update: 2019-01-04 02:03 GMT

త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా. నియిజకవర్గం అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తా అని అన్నారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఏడూళ్లబయ్యారం క్రాస్‌ రోడ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. తనకు పినపాక నియోజవర్గ అభివృద్ధే ముఖ్యమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ ను కలిసి నియోజక అభివృద్ధిపై చర్చిస్తానన్నారు.

ఏడు మండలాల్లోని ప్రధానమైన సమస్య ఇరిగేషన్‌ మీద దృష్టి సారిస్తానని చెప్పారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై పూర్తి నివేధికలు సిద్ధం సీఎంతో మాట్లాడతానని అన్నారు. అలాగే పోడు భూములకు పట్టాలిప్పేంచేందుకు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. కాగా పార్టీ మార్పుపై ఇటీవల ఆయనపై కూడా వార్తలు వచ్చాయి. వాటికి ఆయన సమాధానమిస్తూ.. ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు కావలసింది పనులు. తనకు మాత్రం పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

Similar News