కాంగ్రెస్ సాధు జంతువు... పులి లాంటి బీజేపీ... కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2019-09-18 09:36 GMT

ఉత్తమ్‌, కుంతియా ఉన్నన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ అన్నారు. మీడియాలో చిట్‌ చాట్‌ చేసిన రాజగోపాల్‌ 12 మంది ఎమ్మెల్యేలు వీడాక కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతమైందన్నారు. సాదు జంతువులాంటి కాంగ్రెస్‌ను చంపేసిన కేసీఆర్ పులి లాంటి బీజేపీని బలపర్చారని అన్నారు. సాంకేతికంగా వచ్చే 4 ఏళ్లు తాను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అన్న ఆయన కమలం పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News