వంటేరు ప్రతాప్ రెడ్డికి కేసీఆర్ కీలక పదవి...

Update: 2019-10-23 14:31 GMT

2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటి చేసి ఓడిపోయినా టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక పదవిని కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్ద చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అయన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ నుండి కాంగ్రెస్ తరుపున వంటేరు పోటి చేసారు. కానీ ఆ ఎన్నికల్లో అయన ఓడిపోయారు. అనంతరం అయన కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.




 


Tags:    

Similar News