హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 35 వేల మందితో పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగడానికి..ప్రజలు ఎంతో సహకరించారని మహేందర్ రెడ్డి తెలిపారు.