నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంకు సీట్లు సమానంగా వస్తున్నాయి. మేయర్ పీఠంపై పార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కౌంటింగ్ కేంద్రం చుట్టూ పోలీసులు మోహరించారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు మూడు పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీపీ కార్తికేయ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్లో టీఆర్ఎస్ తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత ఓటమి. నిజామాబాద్ ఆరో డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల సుజాతపై 1509 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఉమారాణి ఘనవిజయం.