టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ కి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన పదవిని అప్పగించారు . రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్ను నియమిస్తూ దానికి సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేసారు . ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్కు క్యాబినెట్ హోదా ఉంటుంది. వినోద్ కుమార్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. రాజకీయాల్లో అనుభవం మరియు తెలంగాణా రాష్ట్రంపై మంచి పట్టున్న నేతగా వినోద్ కుమార్ కి మంచి పేరు ఉండడం వల్ల కేసీఆర్ అయన సేవలను వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.