రైలులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
♦ గౌహతి ఎక్స్ప్రెస్లో నిండు గర్భిణి ప్రసవం ♦ పురుడుపోసిన తోటి ప్రయాణికులు ♦ తల్లి బిడ్డ క్షేమం, మధిర ఆస్పత్రికి తరలింపు
గౌహతి ఎక్స్ప్రెస్ లో ఒక అద్భుతమియన పరిణామం చోటుచేసుకుంది. రైల్లో ప్రయాణిస్తుండగా ఓ గర్భిణి పండంటి బిడ్డను ప్రసవించిన ఘటన మధిరిలో జరిగింది. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న రైలు లో ఓ గర్భవతికి నొప్పులు మొదలయ్యాయి.
దీంతో పక్కన ఉన్న తోటి మహిళల అందరూ ఆమెకి సహాయం చేశారు. దీంతో ఆ మహిళ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. విషయాన్ని అధికారులకి తెలపడంతో అధికారులు రైలుని మధిరిలో నిలిపి తల్లి, బడ్డకు వైద్య సేవలు అందించారు. అనంతరం మధిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలుపడంతో కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు.