తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 53.59 శాతం ఉత్తీర్ణత నమోదు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను www.bse.telangana.gov.in, లో చూసుకోవోచ్చు. కాగా గత జూన్ 10 నుంచి 24 వరకు నిర్వహించిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 61,431 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 260 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.