టిప్పర్‌‌ను ఢీ కొట్టిన స్కార్పియో వాహనం...

Update: 2019-07-06 04:38 GMT

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈద్గా వద్ద వెళుతున్న టిప్పర్ వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న స్కార్పియో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డిన మరో ముగ్గురిని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. మృతులను హైదరాబాద్‌ లోని రామాంతపూర్ కు చెందిన జావీద్, షేక్ అహ్మద్ గా గుర్తించారు. రాత్రి జహీరాబాద్ లో కూతురి తొట్టెల వేడుకలో షేక్ అహ్మద్ పాల్గొని ఈ ఉదయం హైదరాబాద్ కు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Tags:    

Similar News