ఆ రికార్డును పంత్ బ్రేక్ చేస్తాడా ?
వెస్టిండీస్ - టీమిండియా జట్ల మధ్య రేపు (శుక్రవారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
వెస్టిండీస్ - టీమిండియా జట్ల మధ్య రేపు (శుక్రవారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సిరీస్ లో గెలిచిన భారత్ చాలా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. భారత్ ని తక్కువ పరుగులకే కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తుంది వెస్టిండీస్ ..
ఇది ఇలా ఉంటే యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను ఇప్పుడు ఓ రికార్డు ఊరిస్తోంది. భారత మాజీ కెప్టెన్ , సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని రికార్డుని బ్రేక్ చేసే ఛాన్స్ ఇప్పుడు పంత్ ముందుంది.. భారత్-వెస్టిండీస్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన టీ20ల సిరీస్ పరంగా చూస్తే వికెట్ కీపర్గా ధోని ఏడు మ్యాచ్లు ఆడి ఐదు ఔట్లలో భాగమయ్యాడు.
పంత్ కూడా విండీస్తో ఇప్పటివరకూ ఏడు టీ20ల ఆడి మూడు ఔట్లతోనే ఉన్నాడు...ఈ నేపధ్యంలో ఇప్పుడు భారత్-వెస్టిండీస్ల మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది కాబట్టి ధోని రికార్డును పంత్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి దానిని పంత్ చేధిస్తాడా లేదా అన్నది చూడాలి మరి. ఈ సిరీస్లో వికెట్ కీపర్గా సంజూ శాంసన్ జట్టులో ఉన్నప్పటికీ పంత్కే తొలి అవకాశంగా కనబడుతోంది.