ఆయన స్ఫూర్తితోనే మాకీ విజయాలు : కోహ్లి

క్రికెట్ అనేది మానసిక యుద్ధం అయితే దానిని ఎలా గెలవాలో మాకు గంగూలీ చూపించాడు. ఇప్పుడు మేము అయన అడుగు జాడలలో

Update: 2019-11-24 12:43 GMT
virat kohli

సొంత గడ్డపై మరో విజయాన్ని సొంతం చేసుకుంది భారత జట్టు.. బంగ్లాదేశ్ జట్టుతో ఆడినా తొలి డై/నైట్ మ్యాచ్ లో భారత్ అన్ని రంగాల్లో రాణించి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.. దీనితో సిరీస్ ని 2-0 తో కైవసం చేసుకుంది భారత జట్టు.. జట్టు విజయం అనంతరం భారత సారధి విరాట్ కోహ్లి మాట్లాడుతూ " టెస్టు క్రికెట్ అనేది మానసిక యుద్ధం అయితే దానిని ఎలా గెలవాలో మాకు గంగూలీ చూపించాడు. ఇప్పుడు మేము అయన అడుగు జాడలలో నడుస్తున్నాము.. దాదా ఇచ్చిన ఆత్మ విశ్వాసం మాకు చాలా ఉపయోగపడింది. అలాగే ఈ విజయ పరంపరను కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అభిమానులు కూడా మాకు సహకరించారు " అని కోహ్లి చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News