ఐసీసీ ప్రపంచకప్లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా ఆఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీం ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ (67;63 బంతుల్లో 5x4) ఔటయ్యాడు. మహ్మద్ నబీ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని కట్ షాట్ చేయబోగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ రహ్మత్ షా చేతిలో పడింది. దీంతో టీమిండియా 31 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.