కాలి వేళ్ల గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్రౌండర్ విజయ్ శంకర్ టోర్నీ నుంచి వైదొలగనున్నాడు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్ సెషన్లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేస్తుండగా విజయ్శంకర్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. శంకర్ కాలి బొటన వేలి గాయం తగ్గడానికి కనీసం మూడు వారాలు పడుతుందని బీసీసీఐ వెల్లడించింది. శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను ఎంపిన చేసిన విషయాన్ని బీసీసీఐ ఐసీసీకి తెలిపింది. మయాంక్ అగర్వాల్ గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. దీంతో అతడి ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా శిఖర్ ధావన్ ప్రపంచ కప్కు దూరమైన సంగతి తెలిసిందే.