వరల్డ్ కప్ టోర్నీలో భగ్నగా.. ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీ పోరు మొదలైంది. తొలి మ్యాచ్ విజయంతో ఉత్సాహం ఉరకలెత్తుతున్న టీమిండియా మరో విజయం పై కన్నేసింది. ఇక రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న ఆసీస్ ఈ మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు జట్లూ టైటిల్ పోరుకు హాట్ ఫేవరేట్లు గా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు జరుగుతున్న పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా 2 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 2(6), శిఖర్ధావన్ 0(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇండియా జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, జస్ర్పీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ కేరీ, నాథన్ కౌల్టర్ నైల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా