రెండొందలు దాటిన టీమిండియా

Update: 2019-06-16 11:48 GMT

రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ తో కలిసి మరో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నాడు. రోహిత్ సెంచరీ అయ్యేవరకు నిదానంగా ఆడిన కోహ్లీ తర్వాత వేగం పెంచాడు. 35 వ ఓవర్ లో భారత్ జట్టు 200 మార్కును దాటింది. పాక్ బౌలర్లు ఎవరూ ఇండియా బ్యాట్స్ మెన్ పై ప్రభావం చూపించలేకపోయారు. మొత్తమ్మీద 35 ఓవర్లు ముగిసేసరికి ఇండియా ఒక్క వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. రోహిత్ 119 పరుగులతోనూ, కోహ్లీ 24 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News