నిలదొక్కుకున్నారు..

Update: 2019-06-16 15:57 GMT

ఏడూ పరుగులైనా చేయకుండానే వికెట్ పడిపోయింది. భారత్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. పరుగులు తీయడమే కష్టంగా  ఉంది.. ఇటువంటి స్థితి నుంచి కోలుకున్నారు పాకిస్థాన్ బ్యాట్స్ మెన్. టీమిండియా తో వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా తలపడుతున్న పాకిస్థాన్ జట్టు బ్యాట్స్ మెన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. వికెట్లు కాపాడుకుంటూనే పరుగులు కూడా తీస్తున్నారు. త్వరగా తోలి వికెట్ కోల్పోయిన పరిస్థితి నుంచి జమాన్, బాబర్ అజాం లు పాకిస్థాన్ ను నిలబెట్టే దిశలో ఆడుతున్నారు. ఇండియా బౌలర్లను మార్చినప్పటికీ పరుగులను కొద్దిగా నియంత్రించ గలుగుతోంది కానీ.. వికెట్లు మాత్రం పడగొట్టలేకపోతున్నారు బౌలర్లు. 20 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ జట్టు ఒక్క వికెట్ నష్టానికి  87  పరుగులు చేసింది. జమాన్ 44 పరుగులతోనూ, బాబర్ 34 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా ఆ జట్టు 30 ఓవర్లలో 250 పరుగులు చేయాలి. 




Tags:    

Similar News