వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ టీ20 వరల్డ్కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)లో టాప్-10లో ఉన్న ఎనిమిది జట్లు సూపర్-12 స్టేజ్కు నేరుగా అర్హత సాధించాయి. టాప్-10 జట్లలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్ఘానిస్తాన్ జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్కు అర్హత సాధించగా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు మాత్రం అర్హత సాధించలేకపోయాయి. దాంతో ఈ రెండు జట్లు గ్రూప్ స్టేజ్లో ఆరు జట్లతో తలపడి ఈ రౌండ్కు అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది జరిగే క్వాలిఫై రౌండ్లో శ్రీలంక, బంగ్లాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిసెంబర్ 31, 2018 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆయా జట్లు టీ20 వరల్డ్కప్ డైరెక్ట్ అర్హత సాధించాయి. కానీ శ్రీలంక, బాంగ్లాదేశ్ మాత్రం ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. 2014లో చాంపియన్స్గా నిలిచిన శ్రీలంకకు సూపర్ 12 స్టేజ్లో డైరెక్ట్ ఎంట్రీ లేకపోవడంపై ఆ జట్టు కెప్టెన్ లసిత్ మలింగ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము సూపర్ 12 స్టేజ్కు అర్హత సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు. అలాగే బంగ్లా కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ స్పందిస్తూ.. మేము ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయినా టోర్నీలో బాగా రాణిస్తామని చెప్పారు.