తమకు ఎలాగూ సెమీస్ అవకాశం లేదు.. శ్రీలంకను మాత్రం ఎందుకు పంపించాలని అనుకున్నారేమో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు రెచ్చిపోయారు. తొలుత 203 పరుగులకు లంకను కట్టడి చేసి.. తరువాత ఒక్క వికెట్ నష్టపోయి 38 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని టోర్నీలో ఇప్పటివరకూ సాధించని అద్భుత విజయాన్ని అందుకుంది దక్షిణాఫ్రికా.
204 పరుగుల విజయ లక్ష్యంతో చెడన ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టును ఐదో ఓవర్లో మలింగ ఓపెనర్ డికాక్ ను పెవిలియన్ కు పంపించి కంగారు పెట్టాడు. అయితే అటు తరువాత మరో ఓపెనర్ ఆమ్లా, కెప్టెన్ దుప్లిసిస్ మరో వికెట్ పడకుండా జాగ్రతపడ్డారు. నిదానంగా ఆడుతూ, పాడుతూ లక్ష్యం వైపు కదిలారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ అర్థ సెంచరీలను సాధించారు. హషీమ్ ఆమ్లా (80; 105 బంతుల్లో), డు ప్లెసిస్ (92; 102 బంతుల్లో ) అర్ధశతకాలతో రాణించడంతో సఫారీల జట్టు ప్రపంచకప్లో రెండో విజయం సాధించింది.