భారత్‌,న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే ప్రారంభం..

Update: 2019-01-26 01:57 GMT

భారత్‌,న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి టూర్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఈ పోరులోనూ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. మొదటి వన్డేలో న్యూజీలాండ్ ఏ దశలోనూ టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోవడంతో మ్యాచ్‌ వన్‌సైడ్‌గా ముగిసిపోయింది. భారత స్పిన్నర్ల ధాటికి కివీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయగా.... ఆ జట్టు 157 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండో వన్డేలోనైనా సరైన పోటీ ఇవ్వాలని కివీస్ భావిస్తోంది. కాగా మొదటి వన్డేలో గెలిచిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ విజయానికి చేరువవ్వాలని చూస్తోంది. 

Similar News