ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. అదీ ప్రపంచకప్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అసలు అభిమానుల సందడికి హద్దే ఉండదు. ఈనెల 16న రెండు జట్ల మధ్య పోటీ జరగబోతోంది. ఈ నేపధ్యంలో అభిమానులను ఆకర్షించాలని ఇటు భరత్ లోనూ, అటు పాక్ లోనూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ లో ఓ చానెల్ ఒక యాడ్ విడుదల చేసింది.
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి పలు విషయాలను చెబుతున్నట్లు ఓ వీడియోను రూపొందించింది. మరోవైపు, భారత్లోనూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో టీమిండియా చేతిలో పాక్ గతంలో ఘోరంగా ఓడిపోయిన తీరును వివరించారు.
ఇపుడు వీటిపైన భారత్ టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ కోడలు సానియా మిర్జా మండిపడుతున్నారు.
ఈ యాడ్స్ పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది సానియా.
''సరిహద్దుకి అటు.. ఇటు.. ఇరు ప్రాంతాల్లో చిరాకు తెప్పించే ప్రకటనలు వస్తున్నాయి. సీరియస్గా చెబుతున్నాను. ఈ మ్యాచ్కు మీరు మరింత ప్రచారం కలిగించాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా చెత్త పనులతో. ఈ మ్యాచ్పై అభిమానులకు ఇప్పటికే కావాల్సినంతగా శ్రద్ధ ఉంది. ఇది అనూహ్య క్రికెట్ మ్యాచ్. ఇంతకన్నా ఎక్కువ అని మీరు భావిస్తుంటే, మీకు స్వీయ నియంత్రణ అవసరం. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి'' అని ఆమె ట్వీట్ చేశారు.
Cringeworthy ads on both sides of the border 🤮 seriously guys, you don't need to 'hype up' or market the match anymore specially with rubbish! it has ENOUGH attention already!It's only cricket for God sake, and if you think it's anymore than that then get a grip or get a life !!
— Sania Mirza (@MirzaSania) June 12, 2019