కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ను కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ దెబ్బ కొట్టాడు. ఇండియా తొలి వికెట్ను కోల్పోయింది. అయిదు సెంచరీలతో వరల్డ్కప్లో ఊపుమీదున్న రోహిత్.. ఇవాళ ఒక పరుగు మాత్రమే చేసి నిష్క్రమించాడు. భారత అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ మొదలైంది.