ఉక్కిరిబిక్కిరి చేసిన క్రికెట్ తో అలసిపోయిన క్రికెట్ హీరోలంతా కూసింత సేద తీరుతున్నారు. మళ్లీ ఈ నెల 30 నుంచి వరల్డ్ కప్ పోటీలు ఉన్నాయి. వాటికి ముందు రిలాక్స్ గా మానసిక ఉల్లాసాన్ని పొందడానికి కుటుంబాలతో కల్సి విహారయాత్రలు చేస్తున్నారు ఐపీఎల్ లో టోర్నీ గెలిచి సంబరంగా ఉన్న రోహిత్ సరదాగా తాన్ కుటుంబంతో మాల్దీవుల్లో మజా చేస్తున్నాడు.
తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో పాటు కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవుల్లో షికార్లు కొడుతున్నాడు. వాటికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో పంచుకున్నాడు.
ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఛాంపియన్గా నిలిచిన ముంబయి జట్టుకు రోహిత్శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. ముంబయి ఖాతాలో నాలుగో టైటిల్ వేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్ జట్టులో ఐదుసార్లు సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్గా రోహిత్శర్మ.. ముంబయి ఇండియన్స్కు 104 మ్యాచుల్లో 60 విజయాలు కట్టబెట్టి 58.65 విజయాలు నమోదు చేశాడు. రానున్న ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టులో కీలకం కానున్నాడీ డబుల్ సెంచరీల స్పెషలిస్టు.