విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. సెంచరీని సాధించాడు. టెస్టుల్లో అతనికిది నాలుగో సెంచరీ. 154 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు సఫారీలు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం జట్టు స్కోర్ 182. భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.