రోహిత్ సెంచరీ

Update: 2019-06-16 11:30 GMT

ప్రపంచ కప్ లో రోహిత్ మరో సెంచరీ బాదేశాడు. పాకిస్థాన్ తో జరుగుతున్నా మ్యాచ్ లో 85 బంతుల్లో 100 పరుగులు సాధించి సాధికారికంగా చెలరేగిపోయాడు. తొలుత కె ఎల్ రాహుల్ తో కల్సి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ నిదానంగా మొదలు పెట్టి.. తరువాత పాక్ బౌలర్లను ఆడేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కెఎల్ రాహుల్ రోహిత్ చక్కని సహకారం అందించి హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు.  కెఎల్ రాహుల్ ఔటయిన తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ నిదానంగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ కు తోడుగా మంచి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డాడు. మొత్తమ్మీద టీమిండియా భారీ స్కోరు చేసే దిశలో పరుగులు చేస్తోంది. 30 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి ఇండియా 173 పరుగులు సాధించింది. రోహిత్.. కోహ్లీ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News