బంతులు మీదకు లేస్తున్న పిచ్ పై నిలదొక్కుకోవడానికేఇబ్బందిగా ఉన్న తరుణంలో రోహిత్ శర్మ తనదైన శైలిలో టీమిండియా కు వెన్నెముకగా నిలిచాడు. ఓపెనర్ ధావన్, కెప్టెన్ కోహ్లీ త్వరగా అవుటయినా.. కెఎల్ రాహుల్ సహాయంగా నిలవడంతో భారత్ ఇన్నింగ్స్ ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కో పరుగు రాబడుతూ.. అనవసరమైన బంతుల్ని వదిలేస్తూ.. స్కోర్ బోర్డును నడిపిస్తున్నాడు. విజయానికి 228 పరుగులు చేయాల్సిన భారత జట్టు ౩౦ ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి కుదుటపడింది. ఇంకా 99 పరుగులు చేయాలి.. 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.