ఐపీఎల్ 12వ సీజన్ బెంగళూరుకు అస్సలు కలిసిరావడం లేదు. తొలి పోరు చెన్నైతో మొదలుపెడితే..ఆదివారం ఢిల్లీ వరకు బెంగళూరుది గెలుపురుగని వైనమే. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (33 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్లు), మొయిన్ అలీ (18 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది.