టీమిండియా జోరుకు అమీర్+వర్షం కళ్లెం!

Update: 2019-06-16 12:45 GMT

భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న టీమిండియాను పాక్ స్టార్ బౌలర్ అమీర్ దెబ్బతీశాడు. మూడుబంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను తీసి భారత్ జోరును తగ్గించాడు. మొదటి స్పెల్ లో పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు పడగొట్ట లేకపోయినా అమీర్ ఇన్నింగ్స్ చివర్లో ఇండియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగాడు. అమీర్ బౌలింగ్ లో ఆడటానికి భారత బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడుతున్నారు. ఈ దశలో వరల్డ్ కప్ పదకొండో టీమ్ వరుణుడు ఆట మధ్య లోకి వచ్చేశాడు. 46 వ ఓవర్ నాలుగో బతి తరువాత వర్షం రావడం తో మ్యాచ్ ఆగింది. అప్పటికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ధోనీ రెండు బంతులాడి ఒక్క పరుగు చేసి అమీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. విజయ శంకర్ మూడు పరుగులతోనూ, కోహ్లీ 71 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News