వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నపీవీ సింధు

Update: 2019-08-25 12:48 GMT

తెలుగు తేజం పీవీ సింధు సంచలనం సృష్టించింది. వరల్డ్ బ్యాడ్మింటన్‌ షిప్‌ ఛాంపియన్‌ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌లో ప్రత్యర్ధిపై అలవోకగా విజయం సాధించింది. వరుస సెట్లతో ఒకుహారాపై గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. ఆట ప్రారంభం నుంచి ప్రత్యర్ధిపై ఆధిక్యం ప్రదర్శించిన సింధూ విజయం సాధించే వరకు పట్టుకోల్పోకుండా మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో గెలుపు సాధించింది.

Tags:    

Similar News