పటిష్టస్థితిలో పాక్

Update: 2019-06-03 10:20 GMT

ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు పాకిస్తాన్, ఇంగ్లాండ్ దేశాల మధ్య పోరు సాగుతోంది. వెస్టిండీస్ మీద ఓటమి పాలై ఈ పోటీలో గెలిచి కప్ రేసులో ఉండాలని పట్టుదలతో పాకిస్తాన్.. సౌతాఫ్రికా పై ఘనవిజయం సాధించి ఊపు మీద ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి ముందంజలో ఉండాలని ప్రయత్నిస్తోంది.

టాస్ గెలిచి పాకిస్తాన్ కు బ్యాటింగ్ చాన్స్ ఇచ్చిన ఇంగ్లాండ్ కు పాక్ ఆటగాళ్ళు సవాల్ విసురుతున్నారు. తొలి ఓవర్లలో నిదానంగా ఆడిన పాకిస్తాన్ ఓపెనర్లు ఫకర్‌ జమాన్‌, ఇమామ్‌లు కుదురుగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. 

Tags:    

Similar News