న్యూజిలాండ్ స్వీట్ రివెంజ్ : రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

Update: 2020-02-08 10:16 GMT

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ జట్టు 251 పరుగులకి ఆలౌట్ అయింది. దీనితో 22 పరుగులతో ఆతిధ్య జట్టు విజయం సాధించింది. జట్టు విజయం కోసం చివరి వరకు ప్రయత్నించిన జేడేజా జిమ్మీ నిషమ్ వేసిన 48.3 ఓవర్లో భారీ షాట్ కి ప్రయత్నించి అవుట్ గ్రాండ్ హోమ్ కి చిక్కాడు. ఇక ఇప్పటికే మొదటి మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ముందున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి మూడు వన్డేల సిరీస్ ని ఇంకో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ సోమవారం జరగనుంది. ఇక అంతకుముందు జరిగిన టీ 20 సిరీస్ లో భారత్ , న్యూజిలాండ్ ని 5-0 తో ఓడించిన సంగతి విదితమే 



Tags:    

Similar News