మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ : మోర్గాన్ అవుట్

Update: 2019-06-30 12:02 GMT

మహ్మద్ షమీ విజృంభిస్తున్నాడు. మొదటి స్పెల్ లో పరుగులు కట్టడి చేయలేకపోయిన టీమిండియా బౌలర్ తాజా స్పెల్ లో విరుచుకు పడుతున్నాడు. నిప్పుల్లాంటి బంతులేస్తూ ఇంగ్లాన్డ్ ను కట్టడి చేశాడు. ఈ స్పెల్ మొదటి ఓవర్లోనే వికెట్ తీసిన షమీ.. తరువాతి ఓవర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ ను పెవిలియన్ చేర్చాడు. షమీ వేసిన షార్ట్ పిచ్ బాల్ ను షాట్ కొట్టబోయిన మోర్గాన్ ఫిన్ లెగ్ లో కేడర్ జాదవ్ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లాండ్ పరుగుల వేగం కూడా తగ్గుతూ వస్తోంది. టీమిండియా గాడిన పడినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 35 ఓవర్లకు 211 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయింది. రూట్ 25 (31 ), బెన్ స్టోక్స్ 2 (4 ) పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 


Tags:    

Similar News