టీమిండియా కు హోల్డర్ కష్టాలు వదల్లేదు. ఇన్నింగ్స్ 39 వ ఓవర్లో.. తన 9 వ ఓవర్ వేస్తున్న హోల్డర్ కీలకమైన కోహ్లీని వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. 82 బంతుల్లో 72 పరుగులు చేసి ఇండియా ఇన్నింగ్స్ నిలబెట్టిన కోహ్లీ వెనుతిరగడం తో టీమిండియా భారీ స్కోరు సాధించడం కష్టమనే అనిపిస్తోంది. మొత్తమ్మీద 40 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ధోనీ 18 పరుగులతోనూ, పాండ్య 5 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.