ఆగిన వాన.. ముగిసిన కోహ్లీ పరుగుల వేట!

Update: 2019-06-16 13:44 GMT

వర్షం కారణంగా నిలిచినా టీమిండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. వర్షం తెరిపి ఇవ్వడంతో తిరిగి మొదలైంది. అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. వర్షం మొదలయ్యే టప్పటికి 71 పరుగులతో క్రీజులో ఉన్న కెప్టెన్ కోహ్లీ తిరిగి ఆట మొదలయ్యాకా అమీర్ బౌలింగ్ లో బౌండరీ బాడీ సెంచరీ వేపు దూసుకు వెళుతున్నట్టు కనిపించాడు. అయితే, అమిర్ బౌలింగ్లో తర్వాతి బంతికి కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఐదు వికెట్లు కోల్పోయిన ఇండియా 48 ఓవర్లలో 315 పరుగులు చేసింది. క్రీజులో శంకర్ (8 ), జాదవ్ (5 ) ఉన్నారు. 

Tags:    

Similar News