టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను బుమ్రా దెబ్బ కొట్టాడు. బుమ్రా తొలి వికెట్ తీశాడు. అతడు వేసిన 3.4వ బంతిని ఆడిన కరుణరత్నె (10; 17 బంతుల్లో 2×4) ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. 17 బంతులు ఆడిన కరుణరత్నె 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేశాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండోలు క్రీజులో ఉన్నారు.