విండీస్‌పై భారత్‌ ఘన విజయం

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం.

Update: 2019-08-26 02:23 GMT

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/7), ఇషాంత్‌ శర్మ (3/31), షమీ (2/13) చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్(5 వికెట్లు) విజృంభించగా.. ఈసారి బుమ్రానే ముఖ‌్య భూమిక పోషించాడు. కేవలం 7 పరుగులే ఇచ్చిన బుమ్రా 5 వికెట్లు పడగొట్టడంతో విండీస్ కుప్ప కూలింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.

Tags:    

Similar News