భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా నేడు జరుగుతున్న నాలోగో వన్డేలో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధవన్(13) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత రోహిత్ శర్మ (7), అంబటి రాయుడు(0) కూడా పెవిలియన్ బాటపట్టారు. ఐదు వన్డేల సిరీస్లో 3-0 తేడాతో ఆధిక్యంలో దూసుకుపోతున్న టీమిండియా... న్యూజిలాండ్పై 5-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఆడుతోంది. గాయం కారణంగా మూడో వన్డేకు దూరమైన ఎంఎస్ ధోని పూర్తి ఫిట్నెస్ కోల్పోయినందున ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. అలాగే పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చి ఖలీల్ అహ్మద్కు తుది జట్టులో స్థానం కల్పించారు.