క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఆడుతోన్న భారత్

Update: 2019-01-31 02:24 GMT

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా నేడు జరుగుతున్న నాలోగో వన్డేలో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధవన్(13) ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత రోహిత్ శర్మ (7), అంబటి రాయుడు(0) కూడా పెవిలియన్ బాటపట్టారు. ఐదు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో ఆధిక్యంలో దూసుకుపోతున్న టీమిండియా... న్యూజిలాండ్‌పై 5-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఆడుతోంది. గాయం కారణంగా మూడో వన్డేకు దూరమైన ఎంఎస్‌ ధోని పూర్తి ఫిట్‌నెస్‌ కోల్పోయినందున ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అలాగే పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతిని ఇచ్చి ఖలీల్‌ అహ్మద్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. 

Similar News