Ind vs Ban 2nd Test Day 2 : రెండో రోజు ఆట ముగిసే సమయానికి 152 పరుగులు తీసిన బంగ్లా
టీమిండియాతో జరుగుతున్న డే/ నైట్ రెండో టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంటున్న సమయంలోనే రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాను క్లీన్స్వీప్ చేసేందుకు టీమిండియా ఇంకా నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
ముష్ఫికర్ రహీమ్ పాట్నర్ గా ఉన్న తైజుల్ ఇస్లామ్ 21 బంతుల్లో 11 పరుగులు తీసి ఆట ముగిసే చివరి ఓవర్లో పెవిలియన్ కు వెళ్లాడు. దీంతో ఆరు వికెట్లను కోల్పోయిన బంగ్లాదేశ్ ఇంకా 89 పరుగులు తీయాల్సి ఉంది. దీంతో భారత్ ఈ ఇన్నింగ్స్లోనూ తానే విజయ కేతనం ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు ముష్పికర్(59 బ్యాటింగ్: 70 బంతుల్లో 10 ఫోర్లు) కొట్టి బరిలో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.