టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓటమికి చేరువలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో అదే విధమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇదిలా ఉంటే రెండో రోజుకూడా బంగ్లా తొమ్మిది పరుగులకే తమ మూడు వికెట్లను కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో తొలి రెండు వికెట్లను కోల్పోయింది బంగ్లా. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్, మోమినుల్ హక్లను డకౌట్లుగా పెవిలియన్కు పంపించారు భారత క్రికెటర్లు.
ఆ తర్వాత మహ్మద్ మిథున్(6)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. ఇమ్రుల్ కేయిస్(5)ను ఇషాంత్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ వేసిన ఏడో ఓవర్లో ఇమ్రుల్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 347/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో భారత్కు 241 పరుగుల ఆధిక్యం లభించింది.