టీ-20 ఫార్మాట్ 50 వికెట్ల క్లబ్ లో జస్ ప్రీత్ బుమ్రా

Update: 2019-02-25 09:33 GMT

టీమిండియా యువఫాస్ట్ బౌలర్ , యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా టీ-20 క్రికెట్లో 50 వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆట 19వ ఓవర్లో బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా కంగారూ విజయాన్ని ఆఖరి ఓవర్ వరకూ తీసుకురాగలిగాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, మిడిలార్డర్ ఆటగాళ్లు కౌల్టర్ నైల్ ల వికెట్లను బుమ్రా పడగొట్టాడు. టీ-20 క్రికెట్ చరిత్రలో 50 వికెట్ల ఘనత సాధించిన భారత తొలిబౌలర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా భారత తొలిఫాస్ట్ బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా రికార్డుల్లో చేరాడు.

Similar News