నిలకడగా ఆడుతున్న భారత్ ఓపెనర్లు

Update: 2019-06-16 10:06 GMT

ప్రపంచ కప్ సమరంలో పాకిస్థాన్ తో టీమిండియా తలబడుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు ఓపెనర్లు నిలకడైన ప్రారంభాన్నిచ్చారు. శిఖర్ ధావన్ గాయం కారణంగా రోహిత్ శర్మతో కల్సి కెఎల్ రాహుల్ ఓపెనింగ్ కు దిగాడు. నిప్పులు చెరుగుతున్న అమిర్ బౌలింగ్ ను ఆత్మవిశ్వాశంతో ఎదుర్కొటున్నాడు. మరోపక్క రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటిస్తున్నాడు. మొత్తమ్మీద టీమిండియా ఓపెనర్లు నిలకడైన బ్యాటింగ్ తో మంచి పునాది వేస్తున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. 


Tags:    

Similar News