భారత్ స్థానం ఏంటో తేలేది ఈ రోజే ..

Update: 2019-07-06 01:11 GMT

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్ ని ఈ రోజు ఆడనున్నాయి భారత్ మరియు శ్రీలంక జట్లు .. అయితే ఈ మ్యాచ్ ని బట్టి భారత్ స్థానం ఏంటి అన్నది కన్ఫర్మ్ అయిపోతుంది .. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో భారత్ రెండవ స్థానంలో ఉంది . మొదటి స్థానంలో ఆసీస్ 14 పాయింట్లతో ఉంది .. ఇవాళ జరగనున్న మరో మ్యాచ్ లో ఆసీస్ సౌత్ఆఫ్రికా పైన ఓడిపోతే భారత్ శ్రీలంక పైన గెలిస్తే అప్పుడు మనం మొదటిస్థానంలోకి వెళ్తాం .. దీనితో నాలుగో స్థానం ఉన్న న్యూజిలాండ్ జట్టుతో భారత్ తన సెమిస్ మ్యాచ్ ని ఆడుతుంది . ఇలాంటి సమీకరణలు మిస్ అయినచో యదవిధంగా భారత్ మరియు ఇంగ్లాండ్ ల మధ్య సెమిస్ మ్యాచ్ జరుగుతుంది .. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో భారత్ సెమిస్ లోకి అడుగు పెట్టాలని చూస్తుంటే .. భారత్ ని ఓడించి టోర్నీని ఘనంగా ముగించాలని శ్రీలంక చూస్తుంది .. 

Tags:    

Similar News