వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తోంది. వరల్డ్ కప్ లో తన చివరి మ్యాచ్ ఆడుతున్న క్రిస్ గేల్ ఏడు పరుగులకు పెవిలియన్ చేరాడు. ఈ ప్రపంచకప్లో క్రిస్గేల్ (7; 18 బంతుల్లో) పూర్తిగా నిరాశపరిచాడు. చివరి మ్యాచ్లోనూ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. దవ్లత్ వేసిన 5.3వ బంతిని ఆడబోయి కీపర్ ఇక్రమ్ అలీ ఖిల్కు చిక్కాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ 43/1 స్కోరుతో వుంది. ఎవిన్ లూయిస్ (25), హోప్ (9) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోయిన ఈ రెండు టీములకు ఇది నామమాత్రపు మ్యాచ్. అయినా..విండీస్ పరువు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ అయినా గెలవాల్సి ఉంది.