పింక్ బాల్ టెస్ట్ : డబ్బులు రిటర్న్
కానీ మ్యాచ్ ని చూసేందుకు నవంబర్ 25, 26 వ తేదిలలో టికెట్లు బుక్ చేసుకున్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
సొంత గడ్డపై బంగ్లాదేశ్ జట్టుతో ఈడెన్ గార్డెన్లో జరిగిన డే/నైట్ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. రెండవ టెస్ట్ మ్యాచ్ ని కేవలం మూడు రోజులలోనే మ్యాచ్ ని ఫినిష్ చేసింది భారత్ . ఈ మ్యాచ్ నవంబర్ 22 వ తేదీ నుంచి 26వ తేదీ వరుకు జరగాల్సి ఉంది. కానీ మ్యాచ్ 24వ తేదీనే ముగిసింది.
కానీ మ్యాచ్ ని చూసేందుకు నవంబర్ 25, 26 వ తేదిలలో టికెట్లు బుక్ చేసుకున్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే వారు తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వనుంది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్.. దీనితో టికెట్లు కొన్నవారికి ఊరట కల్గించింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గతంలో హెచ్సీఏ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.