నన్ను వివాదాల్లోకి లాగొద్దన్న అనుష్క శర్మ..క్షమాపణలు చెప్పిన మాజీ క్రికెటర్
ఇటీవల జరిగిన ఓ వివాదం విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి మాజీ క్రికెటర్ క్షమాపణలు చెప్పాడు.
ఇటీవల జరిగిన ఓ చిన్న వివాదం విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి మాజీ క్రికెటర్ క్షమాపణలు చెప్పాడు. వన్డే ప్రపంచకప్ సమయంలో భారత సెలక్టర్లలో ఒకరు అనుష్క శర్మకి టీ సర్వ్ చేశాడని మాజీ క్రికెటర్ ఫరూక్ ఆరోపణలు చేసాడు.
దీంతో వెంటనే స్పందించిన అనుష్కశర్మ వరల్డ్కప్ టైమ్లో తాను ఒక్క మ్యాచ్కి మాత్రమే హాజరయ్యానని చెప్పింది. అప్పుడు కుడా తాను ఫ్యామిలీలు కూర్చునే గ్యాలరీలోనే కూర్చున్నాను కాని సెలక్టర్ల బాక్స్లో కుర్చోలేదని స్పష్టం చేసింది. నాకు సెలక్టర్ టీ ఇచ్చారనడంలో ఎలాంటి వాస్తవం లేదని మండిపడ్డారు. మీరు సెలక్టర్లని విమర్శించాలనుకుంటే అది మీ ఇష్టం కాని నన్నుఅనవసరంగా ఇలాంటి వివాదాల్లో లాగొద్దని ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీంతో 82 ఏళ్ల భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ వెంటనే ఆమెను క్షమాపణలు కోరాడు.