ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ ధవన్ చెలరేగి ఆడి.. తమ జట్టుకు ఈ అద్భుత విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన నైట్రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ సాధిం చాడు. రసెల్ (21 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది.'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (63 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు.