సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సొంతగడ్డపై మరో ఓటమి తప్పలేదు. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు), కొలిన్ మున్రో (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఖలీల్ అహ్మద్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (47 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) బెయిర్స్టో (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... ఇతర బ్యాట్స్మెన్ వైఫల్యం సన్ను ఘోరంగా దెబ్బ తీసింది.