భారత్ కి షాక్ : భువికి గాయం ?

వెస్టిండిస్ జట్టుతో జరిగిన మూడు టీ 20 మ్యాచ్ సీరీస్ ను గెలుచుకున్న భారత జట్టు వన్డే సీరీస్ కి సిద్దం అవుతుంది.

Update: 2019-12-13 14:04 GMT
bhuvneshwar kumar

వెస్టిండిస్ జట్టుతో జరిగిన మూడు టీ 20 మ్యాచ్ సీరీస్ ను గెలుచుకున్న భారత జట్టు వన్డే సీరీస్ కి సిద్దం అవుతుంది. ఈ నేపధ్యంలో భారత జట్టుకి భారీ షాక్ తగిలింది. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయమైందని సమాచారం. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. వెన్నునొప్పితో బాధపడుతూ మూడు నెలలు విశ్రాంతి తీసుకున్న భువి విండీన్‌ సిరీన్‌కు ఎంపికయ్యాడు. అంతలోనే మళ్లీ అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడం జరిగింది. బహుశా ఆతడు వన్డే సిరీన్‌ ఆడకపోవచ్చని తెలుస్తోంది. మొదటి వన్డే మ్యాచ్ చెన్నైలో జరగనుంది. 

Tags:    

Similar News