ఐసీసీ ప్రపంచకప్లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా ఆఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు అఫ్గానిస్థాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. కోహ్లీ(67; 63బంతుల్లో 5×4), జాదవ్(52; 68బంతుల్లో 3×4, 1×6) అర్ధశతకాలతో రాణించి భారత్కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్(2 51), మహ్మద్ నబీ(2/33), ముజీబ్ రెహ్మన్(1/26), రషీద్ ఖాన్(1/38) గొప్పగా బౌలింగ్ చేశారు.