గొలుసు దొంగకు చుక్కలు చూపించిన తల్లీ కూతుళ్లు..
దేశ రాజధాని దిల్లీలో ఓ తల్లీకూతుళ్ల సాహసానికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మేడలో గొలుసు కొట్టేద్దామని బైక్పై వచ్చిన దొంగలను తల్లికూతుళ్లు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు.
దేశ రాజధాని దిల్లీలో ఓ తల్లీకూతుళ్ల సాహసానికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మేడలో గొలుసు కొట్టేద్దామని బైక్పై వచ్చిన దొంగలను తల్లికూతుళ్లు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని నంగోలోయ్లో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే.. దిల్లీలో తల్లీ కూతుళ్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. ఇద్దరు దొంగలు బైక్పై వచ్చి దొంగల్లో ఒకరు మహిళ మెడలోంచి గొలుసును లాక్కున్నాడు. అయితే వెంటనే అలర్ట్గా ఉన్న మహిళ వెంటనే దొంగ షర్ట్ పట్టుకోని లాగింది. ఆమె కూతురు కూడా అతన్ని పట్టుకొని చావగొట్టింది. దీంతో దొంగల బైక్ పడిపోవడంతో తప్పించుకోవడానికి వీలులేకుండా పోయింది. ఇంతలోనే చుట్టుప్రక్కల వారు వచ్చి దొంగలను పట్టుకొని దొంగలకు దేహశుద్ది చేశారు. అయితే ఇద్దరిలో దొంగల్లో ఒకరు స్థానికుల చేతుల్లో పట్టుబడగా ఇంకొకడు అక్కడి నుండి పరార్ అయ్యాడు. అనంతరం పోలీసులు ఇద్దరు గొలుసు దొంగలను అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన మొత్తం ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూసిన నెటిజన్లు మహిళ ధైర్యానికి సలాం కోడుతున్నారు.
Delhi Nangloi :
— Piyush Singh (@PiyushSingh83) September 3, 2019
This made my day, what a courageous lady she was, didn't allow to flew away, caught him, pulled down form the Bike & rest job as usual carried by spare people standing on the street.
Zor daar haath safai😂😂 pic.twitter.com/0GcRM1tpFe