నృత్యం ఆపిందని..

వివాహ వేడుకలో చాలా మంది యువతకు ఇష్టమైన సెగ్మెంట్ బరాత్. ఇలాంటి కార్యక్రమంలో ఓ విశాద సంఘటన చోటు చేసుకుంది.

Update: 2019-12-07 06:54 GMT

వివాహ వేడుకలో చాలా మంది యువతకు ఇష్టమైన సెగ్మెంట్ బరాత్. ఇలాంటి కార్యక్రమంలో ఓ విశాద సంఘటన చోటు చేసుకుంది. కేవలం బరాత్ లో నృత్యం ఆపిందనే కోపంతో ఓ వ్యక్తి మహిళా డాన్సర్ ను తీవ్రంగా గాయపచారు. ఈ విశాదకర సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే నవంబర్‌ 30వ తేదీ టిక్రా అనే గ్రామపెద్ద సుహిర్‌ సింగ్‌ పటేల్‌ కుమార్తె పెళ్లి కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన కొంత మంది మహిళా డాన్సర్ లను పిలిపించి బరాత్‌ కార్యక్రమం నిర్వహించారు. అందరూ జోష్ తో ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలో మహిళా డాన్సర్ ఒక్క సారిగి నృత్యాన్ని ఆపేసింది. దీంతోసుహిర్‌ సింగ్‌ బంధువుల్లో ఒకరు కోపోధృక్తుడయ్యాడు. అతని దగ్గరున్న నాటు తుపాకీతో ఆ డ్యాన్సర్లపై కాల్పులు జరిపాడు. అతని కాల్పులకు గురైన డాన్సర్ లలో ఒక డ్యాన్సర్‌ తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు స్పందించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  



Tags:    

Similar News